హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య విద్య పూర్తి చేసిన డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నిమ్స్లో 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుంది. క్యాడర్ వైస్ వెకేన్సీ పొజిషన్, రోస్టర్ పాయింట్లు, అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.