హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్, మరో 11 మంది పోలీసులకు పోలీసు మెడల్స్ లభించాయి.
విశిష్ట సేవలందించినందుకు గానూ టీఎస్ఎస్పీ మూడో బెటాలియన్(ఇబ్రహీంపట్నం) కమాండంట్ చాకో సన్నీకి, పోలీసు ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్ విభాగంలోని ఐజీపీ ఆఫీస్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జీ శ్రీనివాస్ రాజుకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ లభించాయి.