హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 13 మం డలాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ఏర్పాటుకు గతంలోనే ప్రాథమిక నో టిఫికేషన్ ఇచ్చింది. అభ్యంతరాల స్వీకర ణ, పరిశీలన అనంతరం తుది నోటిఫికేషన్ జారీచేసింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 3 మండలాలు ఏర్పడగా, సిద్దిపేట, మహబూబాబాద్, జగిత్యాలలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా
సిద్దిపేట అక్బర్ పేట్-భూంపల్లి, కుకునూరుపల్లి
మహబూబాబాద్ సీరోలు, ఇనుగుర్తి
జగిత్యాల ఎండపల్లి , భీమారం
సంగారెడ్డి నిజాంపేట్
నల్లగొండ గట్టుప్పల్
కామారెడ్డి డోంగ్లి
మహబూబ్నగర్ కౌకుంట్ల