హైదరాబాద్ : ఒడిశా నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్లో గంజాయి తరలిస్తున్నట్టు జీఆర్పీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ రైలు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రాగానే జీఆర్పీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. 120 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయిని ఒడిశా నుంచి ముంబైకి తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.