హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్లోని గుంటూరు డివిజనల్ రైల్వే ఆధ్వర్యంలో 12 రైళ్లను రద్దు చేస్తూ శుక్రవారం రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ-గుంటూరు, గుంటూరు-మాచర్ల, మాచర్ల-నడికుడి, గుంటూరు-రేపల్లె, తెనాలి-విజయవాడ వంటి రైల్వే స్టేషన్ల మధ్య ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 7 వరకు రైళ్ల రాకపోకలు రద్దు చేసినట్టు తెలిపారు.
ఆయా మార్గాలలో రైల్వే నిర్వహణ పనుల వల్ల ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్నారు. నర్సాపూర్-గుంటూరు రైల్వే స్టేషన్ల మధ్య నడిచే రెండు రైళ్లను విజయవాడ-గుంటూరు మధ్య పాక్షికంగా నిలిపివేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.