మహబూబ్నగర్ అర్బన్/మహబూబ్నగర్/టౌన్, సెప్టెంబర్ 2 : నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో నిర్వహించిన జాబ్మేళాకు 12 వేల మంది అభ్యర్థులు హాజరైనట్టు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్నగర్లోని శిల్పారామంలో 105 కం పెనీలతో 10 వేల ఉద్యోగాల కల్పనకు నిర్వహించిన జాబ్ మేళాను కలెక్టర్ రవినాయక్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన వారికి జాబ్ జాయినింగ్ లెటర్లను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడు తూ.. యువత సమయాన్ని వృథా చేయకుం డా అందివచ్చిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని సూచించారు. ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 18 వేల జాబ్ మేళాలతో 35 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. ఇటీవలే పాలమూరు ఐటీ టవర్లో సాఫ్ట్వేర్ రంగంలో 750 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించినట్టు తెలిపారు.