హైదరాబాద్ : యూనిఫాం ఉద్యోగాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, రవాణా, అగ్నిమాపక శాఖల్లోని మొత్తం 17,516 పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేయగా గడువు ముగిసే సమయానికి మొత్తం 12.91 లక్షల దరఖాస్తులు వచ్చాయని టీఎస్ఎల్పీఆర్బీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఆగస్టు 7న ఎస్ఐ ప్రాథమిక అర్హత పరీక్ష, 21న కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష నిర్వహించనున్నారు.
17,516 పోస్టులకు మొత్తంగా 7.33 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు 3.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో 2.76 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఎస్ఐ ఉద్యోగాలకు 2.47 లక్షలు, కానిస్టేబుల్ ఉద్యోగాలకు 9.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు 67 శాతం మంది అభ్యర్థులు ఆప్షన్ ఎంచుకోగా, ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాసేందుకు 32.8 శాతం మంది ఆప్షన్ ఎంచుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట
ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణ్పేట్, జనగాం, రాజన్న సిరిసిల్ల
ఓసీలు – 7.65 శాతం
బీసీ(ఏ) – 8.27 శాతం
బీసీ(బీ) – 17.7 శాతం
బీసీ(సీ) – 0.26 శాతం
బీసీ(డీ) – 20.97 శాతం
బీసీ(ఈ) – 4.11 శాతం
ఎస్సీలు – 22.44 శాతం
ఎస్టీలు – 18.6 శాతం