పెద్దపల్లి : పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైర్లనుదొంగిలించే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పెద్దపల్లి డీసీపీ రూపేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సబ్ డివిజన్లోని జగిత్యాల జిల్లా ఎలిగేడు సుల్తానాబాద్, ధర్మారం, పెద్దపల్లి, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 31 ట్రాన్స్పార్మర్ల నుంచి కాపర్ ను దొంగిలించి అమ్ముకుంటున్న 12 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
వీరివద్ద నుంచి రెండు క్వింటాళ్ల కాపర్ను, ఒక కారు, ఆటో ట్రాలీ, ఆరు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ముఠా సభ్యులంతా ధర్మారం, బసంత్నగర్ గ్రామానికి చెందిన వారని తెలిపారు. విలేకరుల సమావేశంలో పెద్దపెల్లి సబ్ డివిజనల్ ఇంజినీర్ సుదర్శనం, ఏసీపీ సారంగపాణి, సీఐలు ఇంద్రసేనారెడ్డి ప్రదీప్ కుమార్ ఎస్సైలు రాజేష్, ఉపేందర్, లక్ష్మణ్, వినీత తదితరులు ఉన్నారు.