Telangana | హైదరాబాద్ : తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ. 1,190 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేసింది. జిల్లా ఇంచార్జి మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవోలో పేర్కొంది. ప్రతి నియోజకవర్గంలో విద్యాసంస్థలకు రూ. 2 కోట్లు, మంచినీటికి రూ. కోటి చొప్పున మంజూరు చేసినట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.