మెహిదీపట్నం, జూలై 15 : రాష్ట్రంలో అదనంగా 119 గురుకులాలు ఏర్పాటుచేయాలని, గురకులాల్లో దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికీ సీటు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదనంగా గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీసీ ప్రజాసమితి అధ్యక్షుడు భీంరాజు అధ్యక్షతన మాసాబ్ట్యాంక్లోని సంక్షేమ భవన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు లక్షల దరఖాస్తులు వస్తుంటే, ప్రభుత్వం వేల మందికి మాత్రమే అడ్మిషన్లు ఇస్తుందని ఆరోపించారు. బీసీ జనాభాకు తగ్గట్టుగా వెంటనే రాష్ట్రంలో అదనపు గురుకులాలు ఏర్పాటుచేయాలని కోరారు.