హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ప్రారంభమై ఈనెల 12వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.
ఈనెల 5న మొదటి భాష, 6న రెండోభాష, 7న మూడో భాష, 8న గణితం, 9న సైన్స్ పార్ట్-1, 10న సైన్స్ పార్ట్ -2, 11, సోషల్ స్టడీస్, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-1, 12న ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్-2 పేపర్లకు పరీక్షలను నిర్వహిస్తారు.