గుజరాత్లోని మోర్బీలో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తయిన హనుమాన్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ శనివారం వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. ‘హనుమాన్ చార్ ధామ్’ ప్రాజెక్టు కింద దేశంలోని నలుదిక్కులా హనుమాన్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. మొదటిది హిమాచల్ప్రదేశ్లోని సిమ్లాలో ఇప్పటికే ఏర్పాటు చేశారు. రెండోది గుజరాత్లో ఆవిష్కరించారు. మిగిలినవి రామేశ్వరం, పశ్చిమబెంగాల్లో ఏర్పాటుచేస్తారు.