హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): దేశంలో రైల్వేలకు ప్రయాణ టికెట్ల రద్దు, సీనియర్ సిటిజన్లకు రాయితీల ఉపసంహరణ ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తున్నది. టికెట్లను ప్రయాణానికి ముందే రద్దు చేసుకుంటే రూ.75 మినహాయించుకుని మిగతా సొమ్ము వాపసు ఇస్తున్న రైల్వే శాఖ.. రైలు బయలుదేరడానికి 2-3 గంటల ముందు టికెట్లను రద్దు చేసుకున్నవారి నుంచి 50% వరకు కమిషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా 2019-22లో రోజుకు సగటున రూ.7.12 కోట్ల చొప్పున మొత్తం రూ.10,404 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. టికెట్ల బుకింగ్ ద్వారా 2019లో రూ.36,380 కోట్లు రాగా, 2022లో ఇది రూ.47,757 కోట్లకు పెరిగిందని వివరించింది.