సూర్యాపేట : వేట కుక్కల దాడిలో(Hunting dogs) సుమారు 100 గొర్రెలు మృతి(Sheep killed) చెందాయి. ఈ విషాదకర సంఘటన సూర్యాపేట(Suryapet) జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెంలో(Thurpu gudem) చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాయం రవీందర్ గొర్రెలను పెంచుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ఎప్పటిలాగే గొర్రెలను తన వ్యవసాయ క్షేత్రంలో తోలి ఇంటికి వెళ్లాడు. తెల్లావారి వచ్చి చూసే సరికి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందాయి. సుమారు రూ.15 లక్షల పైగా నష్టం జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.