హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం పూర్తి స్థాయి సిలబస్ను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వల్ల గత రెండేండ్లుగా 30 శాతం సిలబస్ను ఇంటర్ బోర్డు తొలగించిన విషయం విదితమే. ఫైనల్ ఎగ్జామ్స్ను కూడా 70 శాతం సిలబస్ను దృష్టిలో ఉంచుకొని నిర్వహించారు.
అయితే ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ వారికి వంద శాతం సిలబస్ను అమలు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ ప్రకటించారు. ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో త్వరలోనే సిలబస్ను అప్లోడ్ చేస్తామని జలీల్ స్పష్టం చేశారు. విద్యార్థులు, ఆయా కాలేజీల సిబ్బంది ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.