హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఏపీలోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద అనంతపురం-గుంటూ రు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటక పెను ప్రమాదం సంభవించింది.
కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్ గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీలో మంటలు చెలరేగాయి. లారీలో 300కి పైగా సిలిండర్లు ఉండగా,100కిపైగా పేలాయి. మంటలను చూసి డ్రైవర్ మోహన్రాజు లారీ ఆపి దిగడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. రోడ్డుకు ఇరువైపులా అర కిలోమీటర్ వరకు వాహనాలను నిలిపివేశారు.