హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యలో ఫేషియల్ రికగ్నిషన్ హాజరును వందశాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. ఈ మేరకు హెచ్ఎంలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈవోలు చొరవ తీసుకోవాలని సూచించారు. ఫేషియల్ రికగ్నిషన్ యాప్ హాజరు ఆధారంగానే సీఎం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు అందించేందుకు ప్రామాణికంగా తీసుకొంటామని స్పష్టంచేశారు.