బన్సీలాల్పేట, సెప్టెంబర్ 11: సికింద్రాబాద్లోని గాంధీ వైద్య కళాశాలలో ర్యాగింగ్కు పాల్పడిన 10 మంది విద్యార్థులను ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. ఈ మేరకు డీఎంఈ, గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రమేశ్రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్తో కొందరు సీనియర్లు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని గాంధీ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ఇటీవల ఆన్లైన్ ద్వారా ఢిల్లీలోని యూజీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో యూ జీసీ అధికారుల నుంచి గాంధీ వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు ఈ-మెయిల్ రావడంతో సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. సీనియర్లు, జూనియర్లను పిలిచి ర్యాగింగ్పై సమగ్ర విచారణ జరిపింది. అనంతరం 2021 బ్యాచ్కు చెందిన ఐదుగురు, 2022 బ్యాచ్కు చెందిన మరో ఐదుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేస్తున్నట్టు డాక్టర్ రమేశ్రెడ్డి ప్రకటించారు.