సంగారెడ్డి: Sangareddyలో భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణాకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు సంగారెడ్డిలో (Sangareddy) వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో తుక్కు లోడుతో వస్తున్న లారీలో 10 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తుక్కు కింద గంజాయి మూటలు పెట్టి అక్రమంగా రవాణా చేస్తున్నారని తెలిపారు. గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి తరలిస్తున్నారని చెప్పారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు.