coronavirus | రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక్క కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర, వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ సంచాలకులు రవీంద్ర నాయక్ తెలిపారు. ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని.. అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు.