పాలకుర్తి సెప్టెంబర్ 12 : జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మించ తలపెట్టిన యాదవ సంఘం సామాజిక భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. పాలకుర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో యాదవ సంఘం సభ్యులు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా వారు యాదవ సంఘానికి గొర్రెల యూనిట్ల రెండో విడత పంపిణీ, కమ్యూనిటీ హాలు, గంగదేవి గుడి నిర్మాణాలకు స్థలాలు కావాలని అడిగారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ వెంటనే వారికి పది లక్షలు మంజూరు చేశారు. అలాగే త్వరలోనే గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కమ్యూనిటీ హాలు, గంగదేవి గుడి నిర్మాణాలకు అవసరమైన స్థలాన్ని పరిశీలించి, కేటాయించాలని పాలకుర్తి తహసీల్దారును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి యాదవ సంఘం నాయకులు, యాదవులు పాల్గొన్నారు.