హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ రూ.10 కోట్లు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గతంలో ఈ ఆలయాలకు ప్రభుత్వం వేములవాడ దేవస్థానం నిధులను కేటాయించింది. ఈ అం శంపై కాంగ్రెస్, బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తుండటంతో నేరుగా దేవాదాయ శాఖ నిధులు ఇచ్చింది.