హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్టు సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు 10.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 4.5 లక్షల టన్నుల సన్నరకం, 5.5 లక్షల టన్నులు దొడ్డు రకం ఉన్నట్టు పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే రూ.500 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశామని తెలిపారు. భారీగా వస్తున్న ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సివిల్ సైప్లె సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని, 8,575 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిందని పేర్కొన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తున్నామని, తద్వారా ఇతర రైతులకు కేంద్రాల్లో స్థలాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు.