Telangana | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మైనార్టీలకు రూ.లక్ష సాయం పథకాన్ని శనివారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రారంభించనున్నారు. తొలి విడతలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాలకు మొత్తంగా 3508 మందిని ఎంపిక చేయగా, వారికి చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకు మైనార్టీ సంక్షేమ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారులు కార్పొరేషన్ అందజేసిన ధ్రువీకరణ పత్రంతో పాటు ఆధార్కార్డు ఉదయం 10 గంటల్లోగా ఎల్బీ స్టేడియంకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో 15 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరుకానున్నారని వెల్లడించారు.