హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని పెద్దఅంబర్పేటలో (Pedda Amberpet) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి పెద్దఅంబర్పేటలో ఓ బైక్ యూటర్ను తీసుకుంటుండగా లారీ ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్నవారిలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించామని, అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.