హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు 2021 సంవత్సరం తీపి కబురుతో ముగిసింది. డిసెంబర్లో రికార్డు స్థాయిలో లావాదేవీలు నమోదయ్యాయి. రాబడి పరంగానూ ఈ ఆర్థిక సంవత్సరంలోనే డిసెంబర్ కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్రిజిస్ట్రార్ ఆఫీసులలో దాదాపు 1.83 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.1,245 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికం. నవంబర్లో రూ.1,150 కోట్ల ఆదాయం రాగా డిసెంబర్లో దాదాపు రూ.100 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది. సాధారణంగా డిసెంబర్లో రిజిస్ట్రేషన్లు నెమ్మదిస్తుంటాయని అధికారులు తెలిపారు. కొన్ని రోజులు ఆగి కొత్త సంవత్సరంలో స్థిర, చరాస్తులు కొందామని అనుకుంటారని, మరికొందరు సంక్రాంతి మూఢాల్లో ఆస్తులు కొనడానికి సంశయిస్తారని చెప్పారు. అయితే ఈసారి ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని.. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెప్తున్నారు.
ఈ కారణాలతో 2021 డిసెంబర్లో రికార్డు స్థాయి లావాదేవీలు, రాబడి నమోదైందని అధికారులు పేర్కొన్నారు.
వ్యవసాయ భూముల లావాదేవీలు కూడా డిసెంబర్లో భారీగానే జరిగాయి. రిజిస్ట్రేషన్, సక్సెషన్, పార్టిషన్, నాలా కన్వర్షన్ కలిపి నవంబర్లో 71,688 లావాదేవీలు జరుగగా డిసెంబర్లో 76,908 లావాదేవీలు నమోదయ్యాయి. ఐదువేలకుపైగా లావాదేవీలు అధికంగా నమోదయ్యాయి.