హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): విశ్వనగరం హైదరాబాద్ను డైనమిక్ నగరంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘డైనమిక్ సిటీ హైదరాబాద్లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకొన్నాను’ అని శనివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్పై రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పందించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ డైనమిక్ సిటీగా ఎదిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్ను డైనమిక్ సిటీగా గుర్తించిన మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశారు.