హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): నూతనంగా రాజ్యసభకు మరోసారి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండి పార్థసారథిరెడ్డి సత్కరించారు. బుధవారం బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలోని రవిచంద్ర నివాసంలో పార్థసారథిరెడ్డి శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. వద్దిరాజును కలిసిన వారిలో ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ నాయకుడు గాలి అనిల్కుమార్ కూడా ఉన్నారు.