హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ‘ఎంసెట్, జేఈఈ, నీట్లో మా విద్యా సంస్థ ప్రభంజనం సృష్టించింది. అన్ని ర్యాంకులూ మావే. ఒకటి.. రెండు.. మూడు..’ అంటూ ఉదరగొట్టే అడ్వర్టయిజ్మెంట్లకు అడ్డకట్టవేసేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టనున్నది. ఒక విద్యార్థి సాధించిన ర్యాంకును రెండు మూడు కాలేజీలు క్లెయిమ్ చేసుకోకుండా చెక్పెట్టేందుకు పటిష్ఠ మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నది. ఈ కసరత్తును ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు ఈ వారంలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం పత్రికలు, మీడియాకు కాలేజీలు అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వాలంటే ఇంటర్ బోర్డు నుంచి విధిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి.
ఈ అనుమతులిచ్చేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ వెల్లడించారు. కొన్ని కాలేజీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాటగిరీ ర్యాంకులను ఓపెన్ ర్యాంకులుగా ప్రకటించుకొంటుండగా.. మరికొన్ని కాలేజీలు ర్యాంకును పెద్దగా, క్యాటగిరీని చిన్నగా ప్రచురించి మోసగిస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు. ఇంటర్ బోర్డు అనుమతి తర్వాతే కాలేజీలు తమ ఫలితాలకు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లను ప్రచురించేలా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు.
ప్రకటనల జారీ ఇలా..
మరికొన్ని మార్గదర్శకాలు
దురుసుగా ప్రవర్తిస్తే బ్లాక్ లిస్ట్లోకే
ఇంటర్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులందరికీ బయోమెట్రిక్ను తప్పనిసరి చేయనున్నారు. ఒక కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులు మరో కాలేజీలో పనిచేయకుండా నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బయోమెట్రిక్ ఆధారంగానే ఇన్విజిలేషన్, జవాబు పత్రాల మూల్యాంకనం.. ఆన్లైన్ మూల్యాంకనం వంటివి చేపడుతారు. అంతేకాకుండా విద్యార్థుల పట్ల దురుసుగా, అసభ్యకరంగా ప్రవర్తించిన, లేదా విద్యార్థులను కొట్టిన లెక్చరర్లను బ్లాక్లిస్ట్లో పెట్టి, జీవితాంతం తెలంగాణలోని మరే కాలేజీలో చేయకుండా నిషేధిస్తారు.