హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరికీ శుభాలు చేకూరాలని రాష్ట్ర మం త్రులు ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నదన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో యావత్ దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలుస్తున్నదని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సరంలో మరింత ప్రగతిని సాధించాలని, అన్నివర్గాల ప్రజ లు సుఖఃసంతోషాలు, ఆనందోత్సాహాలతో ఉండాలని ఆకాంక్షించారు. మం త్రులు హరీశ్రావు, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, నిరంజన్రెడ్డి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగువారంతా శుభకృత్ నామ సంవత్సరం జరుపుకొంటుంటే, తెలంగాణ యువత మాత్రం ఉద్యోగ నామ సంవత్సరం జరుపుకొంటున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కవిత శుక్రవారం ప్రత్యేక సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు.