యాదాద్రి, డిసెంబర్ 7: యాదాద్రీశుడి నూతన గర్భాలయ విమానగోపురం స్వర్ణతాపడానికి నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు రూ.1,37,62,059 విరాళాలు స్వామివారి ఖాతాలో జమ అయినట్టు ఆలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భక్తుల చలాన్ల ద్వారా రూ.6,17,277, ఆర్టీజీఎస్ నెఫ్ట్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ల ద్వారా రూ.9,53,147, చెక్కులు, డీడీల ద్వారా రూ.1,21,91,635 నగదు వచ్చినట్టు వారు పేర్కొన్నారు. అదీగాక 160 గ్రాముల బంగారం స్వామి వారికి చేరినట్టు తెలిపారు.