హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వేతనాల పెంపు సహా ఇతర సమస్యలు త్వరలో పరిషారం అవుతాయని చెప్పారు. టీఆర్ఎస్కేవీ ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవితను కలిశారు. తమ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి, అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ షహనాజ్, లకావత్ సుజాత, సరోజ, శివమ్మ, రామతార తదితరులు పాల్గొన్నారు.