Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థి ఎవరన్నది జోరుగా చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లో చేరిన, పారిశ్రామికవేత్త, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. ఈయన అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైనట్టేనని మహబూబ్నగర్ జిల్లా పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. మహబూబ్నగర్ ఎంపీ, ఎమ్మెల్సీలుగా ఒకే సామాజిక వర్గానికి ఎలా ఇస్తారని ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే తప్ప జీవన్రెడ్డి అభ్యర్తిత్వం దాదాపు ఖాయం అయినట్టేనని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి.