హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, భవిష్యత్తులో దట్టమైన అడవులను చూస్తామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఒంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. హరితనిధితో దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలొస్తాయని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే…
ప్రతి ఒక్కరిలోనూ హరితచైతన్యం
తెలంగాణకు హరితహారం, గ్రీన్ ఇండి యా చాలెంజ్ కార్యక్రమాల ద్వారా మొక్క లు నాటడం, సంరక్షించడం అనే భావన ప్రజల్లో పెరిగింది. సినీతారలు, రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు కూడా గ్రీన్చాలెంజ్లో పాల్గొని పోటాపోటీగా మొక్కలు నాటుతున్నారు. రాబోయే రోజుల్లో దట్టమైన అడవులు పెరుగుతాయి.
హరితహారం ఫలాలు అందుతున్నాయి
ప్రతి సంవత్సరం అటవీశాఖ ఆధ్వర్యం లో మొక్కలు నాటుతున్నాం. అడవుల్లో పండ్లు, ఇతర వాణిజ్యపరమైన చెట్లను పెం చుతున్నాం. ఎకో టూరిజం పెంచేలా గ్రామాలను తీర్చిదిద్దుతున్నాం. పల్లెలు పచ్చగా మారాయి. హైదరాబాద్ గ్రీన్సిటీగా గుర్తింపు పొందింది. హరితహారం ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయి.
హరితనిధితో విప్లవాత్మక ఫలితాలు
పచ్చదనం పెంపుదలలో ప్రజల భాగస్వా మ్యం ఉంటే బాధ్యత మరింత పెరుగుతుందన్న ఆలోచనే హరితనిధి ఏర్పాటుకు కార ణం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన వ్యవహారం కాదు.. ప్రజల్లో ‘ఇది నాది’ అన్న భావనను రేకెత్తించడమే అసలు లక్ష్యం.
పన్ను మినహాయింపు ఇస్తే నెలకు 50 వేలు ఇస్తా
కొండాపూర్, అక్టోబర్ 3: భవిష్యత్తుతరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేస్తున్న హరితనిధికి అందజేసే విరాళాలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇస్తే, తాను నెలకు రూ.50 వేల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తెలుగుశాఖాధ్యక్షుడు ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హరితనిధికిచ్చే విరాళాలకు పూర్తిస్థాయి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల కోట్లాది రూపాయలు సమకూరే అవకాశమున్నదని అభిప్రాయపడ్డారు.
నెలకు 1000 చొప్పున విరాళం
సింగరేణి ఫైనాన్స్ ఎండీ బలరాం ప్రకటన
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హరితనిధికి ప్రతి నెల తన వేతనం నుంచి రూ.1,000 జమ చేస్తానని సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ బలరాం ప్రకటించారు. పచ్చదనం పెంపుదలే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందని, ఐక్యరాజ్యసమితి కూడా దీనిని గుర్తించిందని పేర్కొన్నారు.
హరితనిధికి నెలకు 500 ఇస్తా
బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): హరితనిధికి తన జీతం నుంచి నెలకు రూ.500 చొప్పున జమ చేస్తానని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ ప్రకటించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ను ఉద్యమంలా కొనసాగిస్తున్న ఎంపీ సంతోష్కుమార్ స్ఫూర్తితో తాను కూడా విరాళమివ్వాలని నిర్ణయించుకొన్నట్టు తెలిపారు.