న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) ఇండియాలో ఉంటున్న కుటుంబ సభ్యుల తరపున కరెంట్, గ్యాస్, వాటర్ తదితర యుటిలిటీ బిల్లులను, పాఠశాల, కళాశాల ఫీజులను చెల్లించడానికి భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)ను ఉపయోగించుకోవొచ్చని రిజర్వ్బ్యాంక్ తెలిపింది. బిల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్ అయిన బీబీపీఎస్ వ్యవస్థలో 20,000కు పైగా బిల్లర్లు ఉన్నారు.
నెలకు 8 కోట్లకు పైగా లావాదేవీలు ప్రాసెస్ అవుతాయి. దేశంలోని యూజర్లకు బిల్లుల చెల్లింపు బీబీపీఎస్ సరళతరం చేసిందని, ఇక నుంచి ఈ వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి బిల్లుల చెల్లింపును సైతం అనుమతించాలని ప్రతిపాదించినట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్దాస్ తెలిపారు. దీంతో ఎన్నారైలు వారి కటుంబ సభ్యుల బిల్లులు చెల్లించవచ్చని, ఈ సదుపాయం ప్రత్యేకించి సీనియర్ సిటిజన్లకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఆదేశాలను త్వరలో రిజర్వ్బ్యాంక్ జారీచేయనుంది.