కూసుమంచి రూరల్, డిసెంబర్ 18: పాలేరు నియోజకవర్గంలో ఎంతమంది పోటీ చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్దేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం మండలంలోని చేగొమ్మలో బీఆర్ఎస్ నాయకుడు మల్లీడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పాలేరు నుంచి ఎంతమందైనా పోటీ చేసుకోవచ్చని, వారిని స్వాగతిస్తామని అన్నారు. వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. ఎవరు ఎన్ని చెప్పినా పాలేరు ప్రజలు విజ్ఞులని, బీఆర్ఎస్నే ఆదరిస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. అన్ని రాష్ర్టాలు బీఆర్ఎస్ను, కేసీఆర్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నాయని తెలిపారు. చేగొమ్మ గ్రామ కాంగ్రెస్ నాయకుడు బొల్లికొండ వెంకన్న నేతృత్వంలో 30 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.