న్యూఢిల్లీ : ధాన్యం కొనుగోళ్ల విషయంలో వరుసగా ఏడో రోజు మంగళవారం పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసన చేపట్టనున్నారు. ధాన్యం సేకరణలో సమగ్ర జాతీయ విధానం తీసుకురావాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని, తెలంగాణ నుంచి ధాన్యం, బియ్యం ఎంత సేకరిస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉభయ సభల్లో స్పీకర్ పోడియం వద్ద నిరసన కొనసాగించనున్నారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఇవాళ ఉదయం 10 గంటలకు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే చాంబర్లో విపక్షనేతలు సమావేశం కానున్నారు. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.