వరంగల్ చౌరస్తా, డిసెంబర్ 29: కాకతీయ మెడికల్ కళాశాల పారా మెడికల్ కోర్సుల భర్తీకి రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ శుక్రవారం ముగిసింది. 2023-24 పారా మెడి కల్ విభాగంలో 266 సీట్లకు గురువారం నాడు డిప్లొమా ఇన్ కార్డియాలజీ, డిప్లొమా ఇన్ డ యాలసిస్, డీఏఎన్ఎస్, డీఎంఎస్టీ, డీఓఏ, డీఈపీటీ కోర్సులకు, శుక్రవారం డీఎంసీటీ, డీఆర్ఈఎస్టీ, డీఈసీజీ, డీఆర్జీఏ, డీఎంఐటీ, డీడీఆర్ఏ కోర్సులకు తొలి విడత కౌన్సెలింగ్ నిర్వహించారు.
176 మంది విద్యార్థులకు వివిధ విభాగాల్లో అడ్మిషన్ కల్పించినట్టు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్దాస్ తెలిపారు. మిగిలిన 90 సీట్ల భర్తీకి రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ఖరారు చేస్తామన్నారు.