హైదరాబాద్ : నిజామాబాద్లో గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. లక్కోరా వద్ద రెండు రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టకున్నాయి. ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అటుగా వచ్చిన ఓ కారు వారిపై నుంచి దూసుకువెళ్లింది. తీవ్ర గాయాలకు గురైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.