హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): దక్షిణాదికి ఉత్తరాది ప్రజ ల వలసలకు అడ్డుకట్ట వేయాలని ‘సౌత్ సేన’ దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నదని సౌత్ సేన అధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి రమేశ్, సభ్యులు జగదీశ్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాది ప్రజల వలస లతో దక్షిణాది ప్రజలు ఉద్యోగ, ఉపా ధి, వ్యాపార అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవా డ, విశాఖ, త్రివేండ్రం వంటి నగరాల్లో వ్యాపారాలన్నింటినీ వారి గుప్పిట్లో పెట్టుకున్నారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, కేరళ సీఎం పినరాయి విజయన్, పాండిచ్చేరి సీఎం రంగస్వామికి సౌత్ సేన తమ లేఖలు పంపింది.