SSC Exams | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని పరీక్షాకేంద్రంలో ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మాసాగర్ జెడ్పీహెచ్ఎస్ పరీక్షాకేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్టుమెంటల్ అధికారిని విధుల నుంచి తప్పించారు.