హైదరాబాద్, జూన్6 (నమస్తే తెలంగాణ): ఏపీలో విజయం సాధించి మరోసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ ఫలితాలపై గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. మంత్రి సీతక, ఎంపీ బలరాంనాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, విప్ రాంచంద్రనాయక్, నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే రేవంత్రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను సుహృద్భావ వాతావరణంలో పరిషరించుకునేందుకు సహకరించాలని కోరారు.