హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరిపే కిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఆర్చ్ బిషప్ ఆఫ్ హైదరాబాద్ ఆర్చ్ డయాసెస్ మోస్ట్ రెవరెండ్ డాక్టర్ పూలా ఆంథోనిని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. శనివారం ఆయనను కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. క్రిస్మస్ సందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఈ నెల 21న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నది. ఈ ఉత్సవాలకు అతిథిగా హాజరుకావాలని కోరుతూ సికింద్రాబాద్లోని బిషప్ కార్యాలయానికి మంత్రి కొప్పుల వెళ్లి, ఆహ్వానపత్రిక స్వయంగా అందజేశారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు స్టీఫెన్ సన్, కోరుకంటి చందర్, క్రిస్టియన్ ఆర్థిక సహకార సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాంతివెస్లీ, క్రిస్టియన్ ప్రముఖులు రాయిడిన్ రోచ్, శంకర్ లూక్ తదితరులు ఉన్నారు.