వికారాబాద్, ఏప్రిల్ 18(నమస్తే తెలంగాణ): వికారాబాద్ కలెక్టరేట్లోని టీఎస్ఈడబ్ల్యూఐసీ కార్యాలయంలో సైట్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఇర్ఫాన్.. మంగళవారం జిల్లా కేంద్రంలోని పరిగి రోడ్డులో ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. నవాబ్పేట్ మండలం మాదారం గ్రామంలో ‘మన ఊరు-మన బడి’ కింద ప్రభుత్వ పాఠశాలలో సివిల్ కాంట్రాక్టర్ ప్రభు పనులు పూర్తి చేశారు.
ఈ పనులకు సంబంధించిన బిల్లులు పెట్టేందుకు సైట్ ఇంజినీర్ ఇర్ఫాన్ సివిల్ కాంట్రాక్టర్ను లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే ఇర్ఫాన్కు కాంట్రాక్టర్ రూ.51 వేలు ఇచ్చారు. అయినా మరోసారి రూ.5 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ప్రభు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.