హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులుగా కల్వకుంట్ల కవిత, కూచుకుళ్ల దామోదర్రెడ్డి బుధవారం పదవీ ప్రమాణం స్వీకరించారు. శాసనమండలి చైర్మన్ ప్రొటెం సయ్యద్ అమినుల్ హసన్ జాఫ్రీ తన చాంబర్లో నూతన ఎమ్మెల్సీలతో పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, బీబీ పాటిల్, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ వీ గంగాధర్గౌడ్, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సురభి వాణీదేవి, భానుప్రసాదరావు, ఎల్ రమణ, ఎమ్మెల్యేలు గణేశ్గుప్తా, షకీల్ అహ్మద్, సంజయ్కుమార్, గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీలు శ్రీనివాస్రెడ్డి, నారదాసు లక్ష్మణ్, సుధాకర్రెడ్డి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు నూతన ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ప్రమాణ స్వీకారానికి ఆమె భర్త అనిల్, పిల్లలు ఆదిత్య, ఆర్య హాజరయ్యారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఎనలేని విశ్వాసం ప్రదర్శించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధులకు, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి త్వరగా కోలుకోవాలని కవిత ఆకాంక్షించారు.
ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన కవితకు టీఆర్ఎస్ ఎన్నారై విభాగం కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాల శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే కవిత ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు భరోసా వచ్చినట్టయిందన్నారు. ఎమ్మెల్సీ కవితకు తెరాస ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఆపదలో ఉన్న గల్ఫ్ కార్మికులకు కవిత అండగా నిలిచి, వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్సీగా కవితకు అవకాశం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు టీఆర్ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవితకు ఆర్టీసీ తెలంగాణ కార్మిక సంఘాల పక్షాన తెలంగాణ మజ్దూర్యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం థామస్రెడ్డి అభినందనలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు ఎమ్మెల్సీ కవిత ఎప్పుడూ అండగా ఉంటున్నారని, ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఆమెకు పూర్తి అవగాహన ఉన్నదని పేర్కొన్నారు.