నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 31: ఉత్తర తెలంగాణలో మరోసారి భూప్రకంపనలు కలకలం రేపా యి. పలు జిల్లాల్లో ఆదివారం సాయం త్రం 6:48 గంటల ప్రాంతంలో మూడు, నాలుగు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లల్లోంచి బయటికి పరుగులు తీశారు. మంచిర్యాలతోపాటు లక్షెట్టిపేట, చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, బెల్లంపల్లి, తాండూర్, దండేపల్లి, నెన్నెల్ మండలాల్లో భూమి స్వల్పంగా కంపించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో భూప్రకంపనలు చోటుచేసుకొన్నాయి. దిందా గ్రామంలో రాకేశ్కు చెందిన పశువుల కొట్టం కూలిపోయింది. జగిత్యాలలోని రహమత్పు రా, కొడిమ్యాల మండలంలో భూకం పం కారణంగా ఇండ్లలోని వస్తువులు కిందపడ్డాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోనూ మూడు సెకన్లపాటు భూ కంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై ఇది 4.3గా నమోదు కాగా 77 కిలోమీటర్ల లోతు వరకూ రావడంతో దాని ప్రభావం పెద్దపల్లి జిల్లాపై పడింది. పెద్దపల్లిలోని విష్ణుపురికాలనీ, ఆదర్శనగర్, రామగుండంలోని పలు కాలనీల్లో నూ భూమి కంపించింది. కమాన్పూ ర్, ముత్తారం, రామగిరి, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్, ధర్మారం, అంత ర్గాం మండలాల్లో భూమి కంపించిం ది. కాగా గడిచిన 15 రోజుల్లో భూ కంపం రావడం ఇది రెండోసారి.