సీఎండీకి విద్యుత్తు అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్/ సిటీబ్యూరో, డిసెంబర్ 28 : రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పే రివిజన్ కోసం కమిటీ వేయాలని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావును విద్యుత్తు అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం అసోసియేషన్ ప్రతినిధులు ఎన్ అశోక్, పీ అంజయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ డీ శంకర్, ఉపాధ్యక్షులు సీహెచ్ శ్యామలరావు, ఎంఏ నాసర్ షరీఫ్తోపాటు పలువురు సీఎండీకి వినతిపత్రం సమర్పించారు. 2022 ఏప్రిల్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త పే రివిజన్ను దృష్టిలో పెట్టుకొని సీఎండీని కలిశామని ప్రతినిధులు తెలిపారు.
విద్యుత్తు చార్జీల పెంపుపై ఈఆర్సీ విచారణ
రాష్ట్రంలోని డిస్కంలు ప్రతిపాదించిన విద్యుత్తు టారిఫ్లపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) బహిరంగ విచారణ చేపట్టనున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్తు చార్జీలను పెంచాలనే ప్రతిపాదనను డిస్కంలు ఈఆర్సీకి సోమవారం సమర్పించాయి. వచ్చే ఫిబ్రవరి 18న సిరిసిల్లలో (సెస్) బహిరంగ విచారణ ఉంటుంది. డిస్కంల పరిధిలోకి వచ్చేసరికి.. ఫిబ్రవరి 21న హనుమకొండలో, ఫిబ్రవరి 23న వనపర్తిలో, 25న హైదరాబాద్లో బహిరంగ విచారణ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చార్జీల పెంపుపై ప్రజలు, సంస్థలు, వర్గాల నుంచి రాతపూర్వకంగా అభ్యంతరాలు, సలహాలను విద్యుత్తు నియంత్రణ మండలి స్వీకరించనున్నది.