CM KCR | మరికొద్ది గంటల్లో కొత్త సంవత్సరం 2022లోకి అడుగుపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కష్టాలను అధిగమిస్తూ సుపరిపాలన అందిస్తాం. వినూత్న పంథాలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తాం. సబ్బండ వర్గాలు ప్రగతిపథంలో పురోగమించేలా చర్యలు తీసుకుంటాం.. అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.