హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్ఎస్సీ బోర్డు ఖరారు చేసింది. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపునకు జనవరి 29వరకు గడువు విధించింది. ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. 29 తేదీలోపు చెల్లిస్తే ఎటువంటి ఆలస్య రుసుము ఉండదు. 50 రూపాయల ఆలస్య రుసుమతో ఫిబ్రవరి 10 వరకు చెల్లించవచ్చు. 200 రూపాయల ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు చెల్లించవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించవచ్చు. వార్షిక పరీక్షలు ఏప్రిల్ లేదా మే 2022లో జరగనున్నాయి.