కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి సోమవారం 2376.57 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. దీంతో ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1705.19 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
కుడి కాలువకు 285.99 క్యూసెక్కులు, ఎడమ ప్రధాన కాలువకు 285.99 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.05 అడుగులుగా (3.95 టీఎంసీలు) ఉన్న ట్లు అధికారులు తెలిపారు.